అందరినీ ఏడిపించేసిన మహేష్ బాబు..!

జస్ట్ మరో రెండు రోజుల్లో అయితే టాలీవుడ్ సినిమా దగ్గర మరో బిగ్గెస్ర్ బాక్సాఫీస్ క్లాష్ జరగబోతుంది. గత ఏడాది లానే ఈ ఏడాది కూడా సంక్రాంతి కానుకగా పలు చిత్రాలు రిలీజ్ కి వస్తున్నాయి. కాగా ఈ చిత్రాల్లో టాలీవుడ్ ఎవర్ చార్మింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు.

కాగా మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రమే “గుంటూరు కారం”. మరి వీరి నుంచి ఇది హ్యాట్రిక్ సినిమా కావడంతో మరిన్ని అంచనాలు నెలకొనగా ఎట్టకేలకి చాలానే అడ్డంకుల తర్వాత సినిమా రిలీజ్ కి వస్తుంది. కాగా ఈ సినిమా తాలూకా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గుంటూరులో అత్యంత ఘనంగా జరిగింది.

అయితే ఈ ఈవెంట్ లో మహేష్ బాబు స్పీచ్ మాత్రం ఇప్పటివరకు తాను ఇచ్చిన ఎన్నో స్పీచ్ లలో ది బెస్ట్ వన్ అని చెప్పక తప్పదు. తాను మాట్లాడుతూ ఎప్పుడు లేనిది చాలా ఎమోషనల్ అయ్యిపోయాడు. మొదటిసారి తన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తన సినిమా రిలీజ్ నాటికి తన తండ్రి కృష్ణ గారు లేరని.

ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయ్యినా ఆయన ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండే వాడిని అని కానీ మొదటి సారి ఆయన లేకుండా సినిమా విడుదల చేస్తున్నాను అని ఇక నుంచి నాకు అన్నీ మీరే అమ్మ నాన్న ఎవరైనా మీరే అంటూ తన అభిమానుల కోసం చెప్పడం ఫ్యాన్స్ ని ఏడిపించేసింది. దీనితో మహేష్ బాబు ఈ ఎమోషనల్ స్పీచ్ మాత్రం ఇపుడు ఫ్యాన్స్ సహా ఇతర ఆడియెన్స్ ని కూడా ఎంతగానో కదిలించేస్తుంది.