హీరో శ్రీ‌కాంత్ తండ్రి క‌న్నుమూత‌

హీరో శ్రీ‌కాంత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. శ్రీ‌కాంత్ తండ్రి ప‌ర‌మేశ్వ‌ర‌రావు(70) గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆదివారం రాత్రి క‌న్నుమూశారు. అనారోగ్య కార‌ణాల వ‌ల్లే ప‌ర‌మేశ్వ‌ర‌రావు మృతి చెందిన‌ట్లు తెలిసింది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గ‌త నాలుగు నెల‌లుగా స్టార్ హాస్పిట‌ల్లో చికిత్స‌పొందుతున్నారు. 1948 మార్చి 16న కృష్ణా జిల్లా మేక‌వారి పాలెంలో జ‌న్మించారు. ఆ త‌రువాత కర్ణాట‌క‌లోని గంగావ‌తి జిల్లాకు వ‌ల‌స వెళ్లారు.

ఆయ‌న‌కు భార్య ఝాన్సీ, కుమార్తె నిర్మ‌ల‌, కుమారులు శ్రీ‌కాంత్‌, అనిల్ వున్నారు. ప‌ర‌మేశ్వ‌ర‌రావు అంత్య‌క్రియ‌లు సోమ‌వారం మ‌ధ్య‌హ్నం షేక్‌పేట్ ద‌ర్గా స‌మీపంలోని మ‌హాప్ర‌స్థానం స్మ‌శాన వాటిక‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. హీరో శ్రీ‌కాంత్ ద‌శాబ్దాల కాలంగా సినిమాల్లో కొన‌సాగుతున్నారు. ఇటీవ‌లే ఆయ‌న మంచు విష్ణు నిర్మించిన `చ‌ద‌రంగం` వెబ్ సిరీస్‌లో న‌టించారు.