హీరోయిన్ కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్

క‌రోనా వైర‌స్ అంద‌ర్నీ చుట్టేస్తోంది. ఎవ్వ‌ర్ని వ‌ద‌ల‌డం లేదు. వ‌య‌సులో ఉన్న‌వాళ్ల‌ను, వృద్ధుల‌ను, చిన్న పిల్ల‌ల‌ను ఇలా ప్రతీ ఒక్క‌రికి మ‌హమ్మారి అంటుకుంటుంది. వైర‌స్ కి మ‌నిషి క‌నిపిస్తే చాలు కాటేస్తుంది. ఇక సెల‌బ్రిటీల కుటుంబాల‌లోనూ వైర‌స్ అంతే జోరుగా పంజా విసురుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు బాలీవుడ్, టాలీవుడ్ సెల‌బ్రిటీలు వైర‌స్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ బెంగాలీ హీరోయిన్ ఫ్యామీలి మొత్తాన్ని క‌రోనా చుట్టేసింది. ఆ కుటుంబంలో ఎవ‌ర్నీ వ‌దిలిపెట్ట‌లేదు. చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ అంద‌రికి వైర‌స్ సోకింది. దీంతో ఇప్పుడా సెల‌బ్రిటీ ఫ్యామిలీ మొత్తం క్వారంటైన్ లో ఉంది. వాళ్ల‌ని కొవిడ్ డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఇత‌ర సిబ్బంది త‌ప్ప ఇంకెవ‌రూ క‌ల‌వ‌డం లేదు.

బంధువులు, స్నేహితులు, స‌న్నిహితులు శ్రేయోభిలాషులు అంద‌రూ ఆ కుటుంబానికి దూరంగా పారిపోయారు. ఇంత‌కీ ఆసెల‌బ్రిటీ ఫ్యామిలీ ఎవ‌రంటే? ఆమె ఓ బెంగాలీ న‌టి. ఆ న‌టి పేరు కోయ‌ల్ మ‌ల్లిక్. ఆమె తండ్రి రంజిత్ మ‌ల్లిక్ క‌డా న‌టుడే. త‌ల్లి దీపా మ‌ల్లిక్, భ‌ర్త నిస్పాల్ సింగ్ స‌హా ఇంకా కుటుంబంలో చిన్న పిల్ల‌లు, వృద్ధులు ఉన్నారు. ముందుగా వైర‌స్ కోయ‌ల్ కి అంటుకుంది. ఆమె నుంచి మిగ‌తా కుటుంబ స‌భ్యులంద‌రికీ సోకిన‌ట్లు తేలింది. మ‌రో ఆసక్తిక‌ర సంగ‌తేంటంటే? కోయ‌ల్ మ‌ల్లిక్ మే లోనే ఓ బేబికి జ‌న్మ‌నిచ్చింది. మూడు నెల‌ల బిడ్డ‌. ఆ పాపాయి కి కూడా వైర‌స్ సోకింది. ప్ర‌స్తుతం ఆ ఫ్యామిలీ సెల్ప్ క్వారంటైన్ లో ఉన్నారు.

ఈ వార్త బెంగాలీ ప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిక‌రంగా మారింది. కోయ‌ల్ బ‌య‌ట ఎక్క‌డెక్కడ తిరిగింది? ఎవ‌ర్నీ క‌లిసింది? ఆ కుటుంబ స‌భ్యులు ఎవ‌రెవ‌రు ఎక్క‌డ తిరిగారు? వంటి వివ‌రాల్ని కొవిడ్ సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో బెంగాలీ ప‌రిశ్ర‌మ షాక్ అయింది. ఆ కుటుంబం క‌రోనా నుంచి త్వ‌రగా కోలు కోవాల‌ని దేవుళ్ల‌కు ప్రార్ధ‌న‌లు చేస్తూ ట్వీట్ల వ‌ర్షం కురిపించారు. ద‌ర్శ‌క‌, నిర్మాత‌, స‌త్య‌జిత్ రే సేన్, విక్ర‌మ్ ఛ‌ట‌ర్జీ, జీత్ స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు అంద‌రూ ఆరోగ్యంగా ఉండాల‌ని ఆకాక్షించారు.