స్టార్ హీరోలందరి చూపు ఆమె పైనే..!?

 

స్టార్ హీరోలందరి చూపు ఆమె పైనే..!?

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కెరీర్‌ ప్రారంభంలో పాత్రల విషయంలో  చాలా తప్పులు చేసింది. మన పనిలో తప్పులు చేస్తున్నామంటే దానర్థం.. త్వరలోనే కొత్త విషయాలను నేర్చుకోబోతున్నామని. దీన్ని పూజా  పూర్తిగా నమ్ముతోంది. ఎందుకంటే కెరీర్‌ ప్రారంభంలో పాత్రల ఎంపిక విషయంలో ఆమె చాలా తప్పులు చేసింది .

ఆ తప్పుల నుంచి నేర్చుకున్న కొత్త విషయాల వల్లే ఇప్పుడు క్వాలిటీ పాత్రలను, సినిమాలను ఎంపిక చేసుకుంటోంది పూజా హెగ్డే.  ‘దువ్వాడ జగన్నాధం’, ‘మహర్షి’, ‘అరవిందసమేత వీర రాఘవ’, ‘అల వైకుంఠపురములో’ అంటూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.  

ఇప్పుడు స్టార్ హీరోలందరి చూపు ఆమె పైనే. పూజా హెగ్డే చేసిన సినిమాలు తక్కువే అయినా దక్షిణాదిన అందరి దృష్టి తన వైపునకు తిప్పుకున్న పూజా హెగ్డే… ప్రస్తుతం ప్రభాస్‌ ‘ఓ డియర్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) లో , అఖిల్‌కి జోడీగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో, అలాగే బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ కాంబినేషన్‌లో ‘కభీ ఈద్‌ కభీ దివాలి’ చిత్రాల్లో నటిస్తోంది. లాక్‌డౌన్‌ అనంతరం ఈ చిత్రాల షూటింగ్‌తో పూజా బిజీ బిజీగా గడపనుంది.