సానియా మీర్జా బయోపిక్‌ పై దృష్టి సారించిన సాహో నాయిక శ్రద్ధా కపూర్‌

తెలుగులో తెరంగేట్రం చేసిన మొదటి సినిమానే భారీ బడ్జెట్ సినిమా కావడం అది కూడా జాతీయ గుర్తింపు కలిగిన ‘సాహో’ అయినా దానికి లభించిన మిశ్రమ స్పందనని చూసి నిరాశలో ఉంది బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌. ఇటు పై టెన్నీస్‌ స్టార్‌ సానియా మీర్జా బయోపిక్‌ పై దృష్టి సారించింది.

ప్రస్తుతం ఈ బయోపిక్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. అంతే కాకుండా త్వరలో ‘బాఘి 3’లో నటించబోతుంది. ఈ సిరీస్‌లో వచ్చిన మొదటి సినిమా ‘బాఘి’లో టైగర్‌ సరసన శ్రద్ధా కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాల షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని అంది. సానియా మీర్జా బయోపిక్‌తో పాటు ‘చిచ్చోర్‌’, ‘స్ట్రీట్‌ డాన్సర్‌’ చిత్రాల్లో శ్రద్ధా కపూర్‌ నటిస్తుంది.