ఎంజీఆర్ గా అరవింద్ స్వామి

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథను బయోపిక్ గా తీస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో కీలక పాత్ర అయిన ఎం.జీ.ఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషించనున్నారు. ఈ చిత్రానికి ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ రచయితగా పని చేస్తున్నారు.

ఈ చిత్రంలో కంగనా మేక్ ఓవర్ కోసం హాలీవుడ్ మేకప్ నిపుణులను వినియోగిస్తున్నారు. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్ నుండి ప్రారంభం కానుంది. హిందీ, త‌మిళం, తెలుగు భాష‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.