డబుల్ ఇస్మార్ట్.. ఆయన మిస్సయితే ఎలా?

పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించింది. పూరి జగన్నాథ్ ఇమేజ్ ని కూడా మళ్ళీ ఈ చిత్రం నిలబెట్టింది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన మ్యూజిక్ కూడా మరో ఎత్తు అని చెప్పొచ్చు. సినిమాలోని సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

పూరి జగన్నాథ్ ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్లు ఇచ్చిన సినిమా నిలబడటంలో మాత్రం మణిశర్మ పాత్రని తీసిపారేయలేం. ఇప్పుడు పూరి మరల డబుల్ ఇస్మార్ట్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా సిద్ధం అవుతోన్న ఈ మూవీకి సంబందించిన క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో పూరి జగన్నాథ్ ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని చార్మి నిర్మిస్తోంది.

ఇప్పటికే పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసేశారు. శ్రద్ధా కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే డబుల్ ఇస్మార్ట్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ని ఇంకా పూరి కన్ఫర్మ్ చేయలేదు. నిజానికి ఇస్మార్ట్ శంకర్ కి మణిశర్మ మ్యూజిక్ అందించడంతో డబుల్ ఇస్మార్ట్ కి ఆయన కొనసాగుతారని అందరూ భావించారు.

అయితే మణిశర్మతో క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా పూరి జగన్నాథ్ ఈ సారి మరొకరితో డబుల్ ఇస్మార్ట్ కి మ్యూజిక్ చేయించుకోవడానికి సిద్ధం అవుతున్నారంట. అతని జాబితాలో అనూప్ రూబెన్స్, తమన్ పేర్లు వినిపిస్తున్నాయి. బిజినెస్ మెన్ సినిమాకి పూరి జగన్నాథ్ తమన్ తో వర్క్ చేశారు. అనూప్ రూబెన్స్ తో పూరి టెంపర్ సినిమా చేశారు.

ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ సినిమాకి ఫస్ట్ ఛాయస్ గా అనూప్ రూబెన్స్ ని పూరి జగన్నాథ్ అనుకుంటున్నారట. అలాగే సెకండ్ ఛాన్స్ గా తమన్ పేరు వినిపిస్తోంది. వీరిద్దరిలో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట.