రామ్‌చ‌ర‌ణ్ RRR త‌ర్వాత ఆ ద‌ర్శ‌కుడితోనా?

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ ముంద‌ర ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందో అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఈ చిత్రం త‌ర్వాత చ‌ర‌ణ్ ప్రొడ్యూస‌ర్‌గా మారి కొన్ని చిత్రాల‌ను నిర్మించారు. చిరంజీవితో ఒక చారిత్రాత్మ‌క `సైరా` చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఓ ప‌క్క ఆ చిత్రంతో బిజీగా ఉంటూనే… మ‌రోప‌క్క ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో క‌లిసి ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఎన్టీఆర్‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేస్తూ ఒకేసారి తెలుగు తెర పై ఇద్ద‌రు పెద్ద హీరోలు న‌టిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే చ‌ర‌ణ్ ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత రామ్ చరణ్ ఎవడు చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి తో సినిమాను చేస్తారని అందరూ భావించారు. కానీ మహేష్ వంశీ తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

అయితే తాజాగా `అలా వైకుంఠపురంలో` చిత్రం తో మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్ తో రామ్ చరణ్ చేయనున్నారని ఫిలిం నగర్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. త్రివిక్రమ్ రామ్ చరణ్ ఇటీవల కలవడం, అల్లు అర్జున్ చిత్రం ఫై ప్రశంసలు కురిపించడం జరిగింది. అయితే అదే తరహాలో ఒక కథని సిద్దం చేయమని రామ్ చరణ్ త్రివిక్ర‌మ్ ని కోరినట్లు తెలుస్తుంది. మరి ఈ విషయం కానీ నిజమైతే రామ్ చరణ్ ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్లే. ఇక ఈ మ‌ధ్య కాలంలో చ‌ర‌ణ్ కాస్త గ్యాప్ ఎక్కువ‌గా తీసుకున్న‌ట్లు క‌నిపిస్తున్నా. ఆయ‌న ఓ ప‌క్క నిర్మాత బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తూనే మ‌రో ప‌క్క న‌టుడిగా త‌న కెరియ‌ర్‌ని కొన‌సాగించ‌డం ప్ర‌శంసానీయమ‌ని చెప్పాలి. అయితే గ‌త సంక్రాంతికి విడుద‌లైన `విన‌య విధేయ రామ‌` చిత్రం రామ్‌చ‌ర‌ణ్‌కి అట్ట‌ర్ ఫ్లాప్‌ని ఇచ్చింది.