కొవిడ్-19 మహమ్మారిని తరిమి కొట్టే భాగంలో మే 3 వరకూ లాక్ డౌన్ ని ప్రధాని పొడిగించిన సంగతి తెలిసింది. కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు సప్త సూత్రాలను మోదీ ప్రకటించారు. వాటిని పాటించి కరోనాని తరిమి కొడదామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మోదీ సప్త సూత్రాలపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ప్రజలందరిలోనూ సప్త సూత్రాలపై అవేర్ నెస్ తీసుకొచ్చే వీడియోలు చేస్తున్నారు. తాజాగా అందుకు మెగా ఫ్యామిలీ మొత్తం కదిలింది. స్టే హోమ్ నుంచి స్టే సేఫ్ వరకూ గల సప్తసూత్రాలను మెగా ఫ్యామిలీ ఒక్కొక్కరు వివరించారు.
తొలుత చిరు `ఇంట్లో ఉంటా`! అన్న ప్లాకార్డు పట్టుకున్నారు. అటుపై మెగా నిర్మాత అల్లు అరవింద్ `యుద్ధం` అని… నాగబాబు `చేస్తాం` అని… వరుణ్ తేజ్ `క్రిమిని కాదు`..`ప్రేమని` అని రామ్ చరణ్ ..`పంచుతామన్న` ప్లకార్డును ఉపాసన.. సుస్మిత `కాలు`.. అల్లు శీరష్ `కదపకుండా`…నిహారిక `కరోనాని`… సాయిధరమ్ తేజ్ `తరిమేస్తాం` అని… భారతీయులం `ఒక్కటై `అని వైష్ణవ్ తేజ్…చిరు చిన్న కుమార్తె శ్రీజ `భారత్` ని… అల్లుడు కళ్యాణ్ దేవ్ `గెలిపిస్`తాం అన్న ప్లకార్డును పట్టుకున అవేర్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. అయితే ఈ సందేశాత్మక ఫోటోలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మిస్ అయ్యారు.
చిరంజీవి కరోనా వైరస్ పై సామాజిక బాధ్యతతో ఇప్పటికే ఎన్నో అవేర్ నెస్ వీడియోలు చేసిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీల నుంచి సీసీసీ పేరిట చారిటీ ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి సినీ కార్మికులను చిరంజీవి సహి ఇతర సెలబ్రిటీలు ఆదుకునే ప్రయత్నం చేసారు. ఇంకా నాగార్జున ఇతర చాలా మంది సెలబ్రిటీలు కొవిడ్ 19పై పలు కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని భాషల పరిశ్రమల కంటే టాలీవుడ్ ఈ విషయంలో ఎంతో అవేర్ నేస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండటం విశేషం.