‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్ విడుదల

హీరో విజయ్ దేవరకొండ తన సొంత నిర్మాణ సంస్థ కింగ్ ఆప్ ది హిల్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై నిర్మిస్తున్న మొదటి చిత్రం ‘‘మీకు మాత్రమే చెప్తా’’. ఈ చిత్రానికి – ‘ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్’ అనేది ఉప శీర్షిక. తరుణ్ భాస్కర్,అభినవ్ గోమటం ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్,వాణి భోజన్,పావని గంగిరెడ్డి,నవీన్ జార్జ్ థామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. టైటిల్ కు తగ్గట్టుగానే వినోదభరితంగా చిత్రం ఉండబోతోందని తెలుస్తూనే ఉంది. ఒక చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న మంచి చిత్రంలా కనిపిస్తోంది. ఇక థియేటర్ లో పూర్తిగా నవ్వులు పంచేందుకు చిత్ర బృందం సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల్లో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.