దర్శకుడు తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ ‘అహింస’ టీజర్ విడుదల

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు నిర్మాతలు.

జీవితంలో పెద్ద కలలు లేని కుర్రాడు అభిరామ్. వ్యవసాయం చేసుకుంటూ తనకున్న దానితో సంతోషంగా ఉంటాడు.  హింసకు పూర్తిగా వ్యతిరేకి. అహింసా మార్గాన్ని అనుసరించే బుద్ధుని తత్వశాస్త్రాన్ని అనుసరించమని అందరికీ చెబుతుంటాడు. అయితే కొన్ని అనుకోని సంఘటనలతో అతని జీవితం మలుపు తిరుగుతుంది. అహింసని పాటించే అభిరాయ్ కి హింసాత్మక పరిస్థితులు ఎదురైతే ఏం జరిగిందనేది కథా నేపధ్యంగా టీజర్ చూస్తే అర్ధమౌతుంది.

తేజ ఒక అందమైన ప్రేమకథను అద్భుతంగా చెప్పారు. టీజర్‌ను చూస్తుంటే  కథలో బలమైన సంఘర్షణ వుందని అర్ధమౌతుంది. అభిరామ్ పాత్రకు పూర్తి న్యాయం చేయగా, గీతికకు బలమైనపాత్ర లభించింది. టీజర్‌లో సదా, మరికొన్ని పాత్రలు కూడా ఉన్నాయి.

ఆర్‌పి పట్నాయక్ తన ప్లజంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథకు మరింత అందాన్ని జోడిస్తో, యాక్షన్ పార్ట్‌కి కూడా సరైన మూడ్‌ని సెట్ చేశారు. తేజ, ఆర్పీ పట్నాయక్ కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయగా, సమీర్ రెడ్డి కెమెరా పనితనం అత్యున్నతంగా ఉంది. మొత్తంమీద, టీజర్ భారీ అంచనాలను పెంచింది. ఇది తేజ మార్క్ సినిమా అని భరోసా ఇస్తోంది.

ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు.  సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.

టీజర్ ద్వారా ప్రకటించినట్లుగా, అహింస త్వరలో థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: అభిరామ్, గీతిక, రజత్ బేడీ, సాధా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు.

తారాగణం: అభిరామ్, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు

సాంకేతిక విభాగం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ
నిర్మాత: పి కిరణ్
బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
సంగీతం: ఆర్పీ పట్నాయక్
డీవోపీ : సమీర్ రెడ్డి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్: అనిల్ అచ్చుగట్ల
సాహిత్యం: చంద్రబోస్
ఆర్ట్: సుప్రియ
యాక్షన్ డైరెక్టర్: బివి రమణ
ఫైట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: శంకర్
సిజి: నిఖిల్ కోడూరి
పీఆర్వో: వంశీ-శేఖర్