ప‌వ‌ర్‌స్టార్‌తో మాస్ మ‌హారాజా మల్టీస్టార‌ర్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల జోరు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. `పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్‌సాబ్‌`తో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టాడు. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో బోనీక‌పూర్‌, దిల్ రాజు క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ బ్యాలెన్స్‌గా వుంది.

ఈ సినిమాతో పాటు క్రిష్ చిత్రాన్ని కూడా అంగీక‌రించిన ప‌వ‌న్ ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో వుండ‌గానే హ‌రీష్‌శంక‌ర్ డైరెక్ష‌న్‌లో మైత్రీమూవీ మేక‌ర్స్ చిత్రాన్ని కూడా ఇటీవ‌లే ప్ర‌క‌టించేశాడు. ఇవే కాకుండా త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా కిషోర్ కుమార్ పార్థ‌సాని మరో సినిమాని ప‌వ‌న్ ప్లాన్ చేసిన‌ట్టు గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కిషోర్‌తో చేయ‌బోయే చిత్రం మాత్రం మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మ‌ని తెలిసింది. ఓ త‌మిళ
సినిమా లైన్‌ని తీసుకుని ఈ చిత్రాన్ని చేయ‌బోతున్నార‌ట‌.

కిషోర్ కుమార్ పార్థ‌సాని `గోపాల గోపాల‌` చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌తో చేయ‌బోయే చిత్రం దీనికి సీక్వెల్ అనే స్థాయిలో వుంటుంద‌ని ఇప్ప‌టికే ఓ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఇందులో మ‌రో హీరోగా మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించ‌నున్నాడ‌ని, ఈ చిత్రాన్ని ఇటీవ‌ల రావితేజ‌తో `నేల టిక్కెట్టు`, డిస్కోరాజా వంటి చిత్రాల్ని నిర్మించి భారీ స్థాయిలో న‌ష్టపోయిన రామ్ తాళ్లూరి నిర్మించ‌నున్న‌ట్టు తెలిసింది. రామ్ తాళ్లూరికి, ప‌వ‌న్‌కు మ‌ధ్య మంచి అనుబంధం వుంది. ఆ అనుబంధం కార‌ణంగానే పీక‌ల్లోతు న‌ష్టాల్లో కురుకుపోయిన రామ్ తాళ్లూరిని అప్పుల నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌డం కోస‌మే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని చేయ‌బోతున్న‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్.