ప‌వ‌న్ సినిమా పై కోర్టులో కేసు…షాకింగ్‌లో అభిమానులు

చాలా కాలం త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పింక్ రీమేక్ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న గ‌త రెండేళ్ళుగా రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటున్నారు. ఈ నేప‌ధ్యంలో సినిమాల‌కు కాస్త దూరంగా ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు, బోనీక‌పూర్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తు్న విష‌యం తెలిసిందే. కాగా ఈ సినిమా పవన్ తో చేయాలని అనుకున్నప్పటి నుండే ఎన్నో రకమైన వివాదాలు కూడా వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఈ చిత్రానికి సంబందించిన ఫోటోలు అన్ని కూడా ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా లీకులు జరుగుతుండటంతో పవన్ కూడా దిల్ రాజు పై సీరియస్ అయ్యారని గ‌తంలో స‌మాచారం కూడా వ‌చ్చింది.

ఇక ఇదే విష‌యం పై దిల్‌రాజు కోర్టు మెట్లెక్కాలిసొచ్చింది. తన సినిమా కోసం ఇలా ఎవరు కూడా అక్రమంగా ఫోటోలు, వీడియోలు బయటపెడట్టకూడదని ఆగ్రహాం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఒకవేళ ఎవరైనా రూల్స్‌ను గ‌నుక‌ అతిక్రమిస్తే, వారికి ఏడాది జైలులో పాటు 5 వేల రూపాయల జరిమానా కూడా విధించాల‌ని ఆయ‌న కోరారు. ఇకపోతే ఈ చిత్రానికి సంబందించిన టైటిల్, త‌దిత‌ర మిగ‌తా వివ‌రాల‌న్నీ కూడా మే 15తోగా తెలియ‌జేస్తామ‌న్నారు.

ఇక ఈ చిత్రం కోసం పవన్ కేవలం 25 రోజులు మాత్రమే సమయం కేటాయించార‌ని స‌మాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ ప్రారంభ‌మ‌యింది. ఇక ఈ చిత్రానికి షూటింగ్‌కు సంబంధించిన డైలాగ్ ఒకటి లీక్ అయ్యిందని, ఆ వీడియోలో పవన్ ఫైట్ చేస్తూ ‘నేను నల్లకోటు వేసుకుంటే వేసుకోవటానికి పిటీషన్లు, తీసుకోవటానికి బెయిళ్లు ఉండవు’ అని డైలాగ్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇదివరకే పవన్ నల్లకోటు వేసుకుని రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో లీక్ కావడం, మళ్ళీ ఇప్పుడు డైలాగ్ లీక్ అవ్వడంతో నిర్మాత దిల్‌రాజ్ దీనిపై చాలా ఫైరింగ్‌గా ఉన్నారు.