ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది. స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ వేణు ప్లాన్ చేస్తున్నాడు. నిర్మాత‌లు కూడా ప‌వ‌న్ డేట్స్‌ని బ‌ట్టి షూటింగ్ స్పీడ‌ప్ చేసేశారు. అయితే ఈసినిమాతో పాటు ప‌వ‌న్ మ‌రో చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

పిరియాడిక్ డ్రామాగా తెర‌పైకి రాబోతున్న ఈ చిత్రాన్ని క్రిష్ రూపొందించ‌బోతున్నారు. దాదాపు ఈ రోజు (29-01-2020) అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ప్రారంభిం కావ‌చ్చిని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం ఇద్ద‌రు హీరోయిన్‌ల‌ని క్రిష్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. అందులో ఓ హీరోయిన్‌గా అంటే రెండ‌వ నాయిక‌గా ప్ర‌గ్యా జైస్వాల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఇక మెయిన్ హీరోయిన్‌గా బాలీవుడ్ భామ‌ని సంప్ర‌దిస్తున్నార‌ట‌. సోనాక్షీసిన్హా ఈ ప్రాజెక్ట్‌పై స్పెష‌ల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. రెమ్యున‌రేష‌న్ సెట్ట‌యితే సొనాక్షి టాలీవుడ్ ఎంట్రీ ఇక లాంఛ‌న‌మే.