ప్రతీ రోజు పండగే షూటింగ్ పూర్తి

హీరో సాయి ధరమ్ తేజ్ దర్శకుడు మారుతీతో చేస్తున్న చిత్రం ‘ప్రతీ రోజు పంగడే’. ఈ సినిమాలో సత్య రాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా రాశి ఖన్నా సాయి ధరమ్ తేజ్ కు జోడీగా నటిస్తోంది.

పక్కా కుటుంబ కధా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ చిత్రం షూటింగ్ ఇంతవరకు గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఇక షూటింగ్ ముగించుకుని ఈ చిత్ర బృందం ఇంటికి తిరిగి వచ్చింది. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. రాజమండ్రి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.