నిప్పు.. ఉప్పెన‌కు రేపే తెర‌తీస్తున్నాడు!

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ సంచ‌ల‌నాత్మ‌క చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌రణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్ర‌మిది. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టికే దాదాపు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. మిగ‌తా భాగం షూటింగ్ బ్యాలెన్స్‌గా వుంది. అలియా ఎప్పుడంటే అప్పుడే ఆమెకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల్ని పూర్తి చేయాల‌ని ఆమె పిలుపు కోసం జ‌క్క‌న్న ఎదురుచూస్తున్నాడు.

అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్న రామ్‌చ‌ర‌ణ్‌ ఉప్పెన‌గా.. కొమ‌రం భీం పాత్ర‌లో న‌టిస్తున్న ఎన్టీఆర్ నిప్పుగా క‌నిపించ‌బోతున్నారు. వీరి పాత్ర‌ల స్వాభావాన్ని సింబాలిక్‌గా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లోనే ఇండైరెక్ట్‌గా రివీల్ చేసిన జ‌క్క‌న్న ఉగాది రోజున ఈ చిత్ర టైటిల్ లోగోని. మోష‌న్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. కరోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తున్న వేళ జ‌క్క‌న్న ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్రేక్ష‌కుల్ని ఈ చిత్ర టైటిల్ లోగో, ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌తో ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.