నా తదుపతి చిత్రం విజయ్ దేవరకొండతోనే – ఐశ్వర్య రాజేష్

నేడు తెలుగులో విడుదల అయినా కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈమెకు తెలుగులో ఇదే మొదటి సినిమా. తమిళంలో ఇంత వరకు నటనకు ఆస్కారం ఉన్న సినిమాలే చేసి ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. తెలుగులో కూడా మంచి నిర్మాత, బ్యానర్, కథ కోసం నిరీక్షించి ఈ సినిమా చేసింది. ఇందులో ఆమె కష్టం ఎవరికైనా తెలుస్తుంది. మంచి టాల్క్ తెచ్చుకున్న ఈ హీరోయిన్ ను పలకరిస్తే తన గురించి చెప్పుకొచ్చింది.

ఈమె కూడా నటన కుటుంబానికి చెందినదే. తెలుగులో హాస్య నటి శ్రీలక్ష్మి ఈమెకు స్వయానా అత్త. తమిళంలో 25 సినిమాలు చేసింది. ఆ పైన హిందీలో ఒకటి. ఇక తెలుగులో దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా ఖరారు అయింది అని చెప్పుకొచ్చింది.