మెగా మేనల్లుడు సాయితేజ్ ( సాయి ధరమ్ తేజ్) చిత్రలహరి హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అప్పటివరకూ వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డ మెగా మేనల్లుడు చివరికి ఎలాగూ బండి ని సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు. స్ర్కిప్ట్ ఎంపిక విషయంలో గతంలో చేసిన తప్పిదాలను రివైండ్ చేసుకుంటూ జాగ్రత్త పడుతున్నాడు. దర్శకులు ఎంపిక విషయంలో సైతం తన పాత పద్దతిని పక్కనబెట్టి న్యూ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఓ కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి.
అయితే ఈ యంగ్ హీరో కెరీర్ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే చాలా చేదు సంఘటనలే ఉన్నాయి. తనని అమ్మ నాన్నై పెంచింది తన తల్లి మాత్రమేనని..తనకి.. తమ్ముడు వైష్ణవ్ తేజ్ కి ఏలోటూ రాకుండా చూసుకున్నది తనేనని ఎన్నోసార్లు చెప్పాడు. ఇదే సమయంలో తండ్రి గురించి చెప్పమంటే మాత్రం ప్లీజ్ బ్రదర్ అతని విషయం మాత్రం నా దగ్గరకు తీసుకురావొద్దని అసహనం వ్యక్తం చేసేవాడు. అయితే తాజాగా తండ్రి గురించిన విషయాలను తాజాగా ఓ ఇంటర్వూలో వెల్లడించాడు. తేజ్ పదోతరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు గొడవలు పడి విడిపోయారుట. ఆ తర్వాత కొంత కాలానికి తన తల్లి రెండవ పెళ్లి చేసుకున్నారని తెలిపాడు. ఆయన మంచి వ్యక్తి అని…ఓ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నారని తెలిపాడు. అయితే ఈ విషయాన్ని ఎప్పుడూ మీడియాకు వెల్లడించలేదు. తండ్రి గురించి ఎప్పుడూ ప్రశ్నించినా తన తండ్రి కూడా తల్లే అని చెప్పి తప్పించుకునేవాడు. మరి ఇప్పుడిలా ఓపెన్ అవ్వడానికి గల కారణం ఏంటో?