ఛార్మీకి మెంట‌లా.. పిచ్చిగాని ప‌ట్టిందా?

సెల‌బ్రిటీలు ఎంత వ‌ర‌కు ఉండాలో అంత వ‌ర‌కే వుండాలి.. హ‌ద్దులు దాటితే మాత్రం నెటిజ‌న్స్ విమ‌ర్శ‌ల‌తో త‌లంట‌డం ఖాయం. ఛార్మీ చేసిన ప‌ని చూసిన వారంతా అదే ప‌ని చేస్తున్నారు. ఘాటు వ్యాఖ్య‌ల‌తో ఛార్మీపై తిట్ల దండ‌కం అందుకుంటున్నారు. ఛార్మీకి మెంట‌లా.. పిచ్చిగాని ప‌ట్టిందా? అంటూ విరుచుకుప‌డుతున్నారు. బూతులు తిడుతున్నారు. డాక్ట‌ర్‌కి చూపించుకో అంటూ స‌ల‌హాలిస్తూ విరుచుకుప‌డుతున్నారు.

దీనికి కార‌ణం ఛార్మీ చేసిన పిచ్చిప‌ని. ఒక్క‌సారిగా ఇరుకున ప‌డేసింది. `ఇస్మార్ట్ శంక‌ర్‌` హిట్ త‌రువాత మాంచి జోష్‌ని చూపిస్తున్న ఛార్మీ గ‌త కొన్నినెల‌లుగా వ‌రుస వీడియోల‌తో సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తోంది. అంతా బాగానే వుంది కానీ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ గురించి వెకిలిగా ఛార్మీ చేసిన ఓ వీడియో నెటిజ‌న్స్‌కి మంటెక్కించేసింది. ఢిల్లీకి.. తెలంగాణ‌కి క‌రోనా వైర‌స్ చేరిద‌ట‌.హా..హ‌..హా.. వార్త‌ల్లో చ‌దివివాను. మ‌రి ఆల్ ది బెస్ట్ మీకు..` అని చేసిన ఓ టిక్ టాక్ వీడియోని సోష‌ల్ మీడియ‌లో పోస్ట్ చేసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన నెటిజ‌న్స్ పిచ్చి పీక్స్‌కి చేరింద‌ని, ఆగ్ర‌హాన్ని ప్ర‌క‌టిస్తూ ఛార్మీకి త‌లంటేశారు.