చిరు ట్వీట్‌కి స్పందించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌!

చిరు ట్వీట్‌కి స్పందించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌న్‌క‌ల్యాణ్ గురువారం ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న తండ్రి నాస్తికుడ‌ని, క‌మ్యూనిస్టు అని ఉన్న‌ఫ‌లంగా ఆయ‌న భ‌క్తుడిగా మారిపోయార‌ని వెల్ల‌డించడం ఆస‌క్తిక‌రంగా మారింది. అస‌లు విష‌యం ఏంటంటే ఈ నెల 8న హ‌నుమాన్ జ‌యంతి జ‌రిగింది. ఈ రోజు గురించి మంగ‌ళ‌వారం చిరు ఓ ట్వీట్ పెట్టారు. `ఈ తారీఖుతో నాకు బోల్డంత అనుబంధం వుంది.. (స‌శేషం) అని ట్వీట్ చేశారు. చిరు ట్వీట్‌కి అర్థ‌మేంటి?. అస‌లు ఆరోజుకున్న ప్ర‌త్యేక‌త ఏంట‌ని మెగా ఫ్యాన్స్‌లో చాలా మంది తెలియ‌క బుర్ర‌గోక్కున్నారు.

అయితే రెండు రోజుల త‌రువాత అంటే 8న త‌ను పెట్టిన పోస్ట్‌కి క్లారిటీ ఇస్తూ ఈ రోజు హ‌నుమాన్ జ‌యంతి అని. ఈ రోజుతో త‌న‌కు ప్ర‌త్యేక‌మైన అనుబంధం వుంద‌ని, ఆ దైవంతో త‌న‌కున్న అనుబంధాన్ని వెల్ల‌డించి ఫ్యాన్స్‌తో పాటు నెటిజ‌న్స్‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. దీనిపై ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురువారం స్పందించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `హ‌నుమాన్ ఆరాధ‌న అన్న‌య్య చిరంజీవిగారి ద్వారా మా ఇంట్లో అల‌వాటైంద‌ని. అప్ప‌టి వ‌ర‌కు మా నాన్న నాస్థికుడు, క‌మ్యూనిస్టు. అలాంటి ఆయ‌న వున్న‌ట్టుండి రామ భ‌క్తుడిగా మారిపోయార‌ని వెల్ల‌డించాడు.

తాను యుక్త వ‌య‌సులో వున్న రోజుల్లో హ‌నుమాన్ చాలీసాను 108 సార్లు పచ‌దివేవాడిన‌ని, గుర్తు చేశారు. అన్న‌య్య ట్వీట్‌కి త‌మ్ముడు రీట్వీట్ చేసి మ‌రీ స్పందించ‌డంతో మెగా ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.
ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకుంటోంది.