గీతా ఆర్ట్స్‌లో ప‌వ‌ర్‌స్టార్ న‌టిస్తారా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ `పింక్‌` రీమేక్‌తో స్పీడు పెంచారు. ఈ చిత్రానికి `వ‌కీల్ సాబ్‌` అనే టైటిల్‌ని ఇటీవ‌లే చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కు ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ఓ రేంజ్‌లో మోత‌మోగింది. ఇప్ప‌టికే ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మేలో సినిమా ర‌చ్చ చేయ‌బోతోంది. ఇదిలా వుంటే క్రిష్‌తో మ‌రో సినిమా చేస్తున్న ప‌వ‌న్ తాజాగా మ‌రో చిత్రాన్ని అంగీక‌రించిన‌ట్టు తెలిసింది.

అదీ గీతా ఆర్ట్స్‌లో. గీతా ఆర్ట్స్‌లో ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ‌బ్బాయి ఇక్క‌డ‌మ్మాయి. జాని, జ‌ల్సా చిత్రాల్లో న‌టించాడు. ఈ మూడు చిత్రాల్లో మొద‌టిది ప‌ర‌వాలేద‌నిపించింది. రెండ‌వ‌ది పేరు తెచ్చినా ఫ్లాప్‌గా మిగిలింది. ఇక మూడ‌వ చిత్రం `జ‌ల్సా` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. మ‌ళ్లీ మ‌రోసారి గీతా ఆర్ట్స్‌లో ప‌వ‌న్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ట‌. దాదాపు 12 ఏళ్ల క్రితం ఇదే కాంబినేష‌న్‌లో `జ‌ల్సా` వ‌చ్చింది. బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది.