క‌ల్యాణ్‌రామ్ మ‌ళ్లీ అదే త‌ప్పుచేస్తున్నాడా?

నితిన్ హీరోగా న‌టించిన `శ్రీనివాస క‌ల్యాణం` ఆయ‌న కెరీర్‌లోనే అత్యంత డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వేగేశ్న స‌తీష్‌తో క‌ల్యాణ్‌రామ్ ఇటీవ‌ల `ఎంత మంచి వాడ‌వురా!` చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ ఎప్పుడు వ‌చ్చిందో ఎప్పుడు వెళ్లిందో తెలియ‌కుండానే థియేట‌ర్ల‌లోంచి వెళ్లిపోయింది.

ఒక ఫ్లాప్ డైరెక్ట‌ర్ కి ఛాన్స్ ఇచ్చి క‌ల్యాణ్‌రామ్ త‌ప్పు చేశాడ‌ని అంతా అన్నారు. మ‌ళ్లీ ఇదే త‌ర‌హా త‌ప్పుని క‌ల్యాణ్‌రామ్ చేస్తున్న‌ట్టు తెలిసింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా `డిస్కోరాజా` చిత్రాన్ని వి.ఐ.ఆనంద్ తెర‌కెక్కించాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా అడ్ర‌స్ లేకుండా పోయింది. నిర్మించిన నిర్మాత‌కు భారీ న‌ష్టాల‌ని అందించింది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ ఇటీవ‌ల క‌ల్యాణ్‌రామ్‌కు క‌థ వినిపించార‌ట‌. కొత్త‌గా వుండ‌టంతో క‌ల్యాణ్‌రామ్ ఓకే చెప్పార‌ని తెలిసింది. ఈ విష‌యం తెలిస‌న వాళ్లు మాత్రం క‌ల్యాణ్‌రామ్ మ‌ళ్లీ చేసిన త‌ప్పే మ‌ళ్లీ చేస్తున్నాడ‌ని అంటున్నార‌ట‌.