`ఇండియన్ -2` సెట్‌లో ప్ర‌మాదం ముగ్గురు మృతి!

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఇండియన్ -2`. 1996లో వ‌చ్చిన చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని శంక‌ర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అల్లిరాజా సుభాస్క‌ర‌న్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. చెన్నైలో ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. ప్ర‌మాద వ‌శాత్తు క్రేన్ కూల‌డంతో అక్క‌డే వున్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కృష్ణ (34), ప్రొడ‌క్ష‌న్ అసిస్టెంట్ మ‌ధు (29) ఆర్ట్ డైరెక్ట‌ర్ అస్టిస్టెంట్ చంద్ర‌న్ (60) మ‌ర‌ణించిన‌ట్టు లైకా ప్రొడ‌క్ష‌న్స్ తెలియ‌జేసింది.

ఈ ప్ర‌మాదంలో ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కు గాయాల‌య్యాయని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. అయితే అలాంటి ఏమీ లేద‌ని, శంక‌ర్ బాగానే వున్నార‌ని వెల్ల‌డించారు. ముగ్గురు హార్డ్ వ‌ర్క‌ర్స్‌ని కోల్పోయామ‌ని, ఆ బాధ‌ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేమ‌ని లైకా ఓ లెట‌ర్‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ప్ర‌మాదంలో మ‌రి కొంద‌రు కూడా గాయప‌డ్డార‌ని తెలుస్తోంది. వాసు, రంజాన్‌, అరుణ్‌ప్ర‌సాద్‌, కుమార్‌, క‌లైచిత్ర‌, గుణ‌బ‌ల‌న్‌, తిరునావుక్క‌ర‌సు, మురుగ‌దాస్ గాయ‌ప‌డిన వారిలో వున్నార‌ని తెలుస్తోంది.

ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలుసుకున్న సీమ‌ప ఏరియాకు చెందిన ఓ పోలీస్ ఆఫీస‌ర్ వెంట‌నే సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుని కేసు ఫైల్ చేశార‌ని, జ‌రిగిన సంఘ‌ట‌న‌పై విచార‌ణ చేస్తున్నార‌ని త‌మిళ మీడియా చెబుతోంది.