ఆ డైరక్టర్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా?

పవన్ ని కలిసిన తమిళ డైరక్టర్

పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారా, చేయరా అనే విషయమై గత కొంతకాలంగా మీడియాలో రకరకాల వాదనలు జరుగుతన్నాయి. ఫ్యాన్స్ మాత్రం పవన్ పొరపాటున కూడా సినిమా చెయ్యరు అంటున్నారు. కానీ మీడియా మాత్రం ఎప్పటికప్పుడు …ఫలానా డైరక్టర్ తో సినిమా చెయ్యబోతున్నారు అంటోంది. ఏది నిజం..ఏది అబద్దం..ఏం జరగబోతోంది…ఏం జరుగుతోంది అనేది మాత్రం సగటు అభిమానికి అర్దం కావటం లేదు. తాజాగా మరోసారి ఇలాంటి వార్తే గుప్పుమంది. అయితే ఈ సారి తమిళ దర్శకుడు కథ విన్నారని ఆ వార్త.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని తమిళ దర్శకుడు హరి కలవడం జరిగింది. గతంలో హీరో సూర్యతో దర్శకుడు హరి `సింగం` సీక్వెల్స్ ని అందించి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ని అందించడంలో హరి ఓ డిఫరెంట్ స్టైల్. పవన్ ఇమేజ్ కి తన స్టైల్ ని జత చేసి దర్శకుడు హరి ఓ టెర్రిఫిక్ స్టోరీని సిద్ధం చేసి పవన్ ని సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మించడానికి ప్లాన్ చేస్తోందంటున్నారు.

మరో ప్రక్క రీసెంట్ గా దర్శకుడు క్రిష్ తన తదుపరి చిత్రం కోసం పవన్ కల్యాణ్ ని కలిశాడని వార్తలు వినబడ్డాయి. త్వరలోనే దీనిపై పవన్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంంది. రీఎంట్రీ వుండదని పవన్ చెబుతున్నప్పటికి ఆయనకు ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన సంస్థల లీకులతో పవన్ రీఎంట్రీ తప్పకుండా ఉంటుందనే అనిపిస్తోంది.