ఆగష్టు 9 న మన్మధుడు 2

అక్కినేని నాగార్జున తాజా చిత్రం ‘మన్మధుడు 2 ‘. తన కెరీర్లో చాలా పెద్ద హిట్ అయిన మన్మధుడు సినిమాకి సీక్వెల్ కావడంతో ఈ సినిమా పై చాలా అంచనాలు ఉన్నాయి. విడుదల అయిన టీజర్ కూడా ఆసక్తిగానే ఉంది. ఈ సినిమాలో నాగార్జున కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. లక్ష్మి, ఝాన్సీ మొదలైన వారు కనిపిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం చేపట్టిన ఈ సినిమా వచ్చే నెల ఆగష్టు 9 న విడుదల అవుతోంది. వయాకామ్ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.