అఖిల్ సినిమాలో మరో కొత్త ముఖం

యువ హీరో అక్కినేని అఖిల్ కు కెరీర్ కి బ్రేక్ ఇచ్చే చిత్రం ఇంకా రాలేదు. అందుకోసమే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను సినిమా సినిమాకి వృద్ధి చెందుతున్నాడు. అదివరకు చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రధాన లోపం సరైన ఇమేజ్ లేని హీరోయిన్లు. ఏ హీరోయిన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం అతని సినిమాలో ప్రధాన లోపం.

అందులో ఇప్పుడు అఖిల్ 4 వ చిత్రం దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజ హెగ్డే అఖిల్ సరసన నటిస్తోంది. కాగా మరో హీరోయిన్ గా సాయి కామాక్షి భాస్కర్ల లు తీసుకున్నారు దర్శకనిర్మాతలు. ఈమె మిస్ తెలంగాణ మాత్రమే కాదు మిస్ ఇండియా ఫైనలిస్ట్ కూడా. ఏది ఏమైనా నటనతో మెప్పిస్తేనే కానీ ఈ పోటీ పరిశ్రమలో చోటు ఉండదు. అందువల్ల కామాక్షికి మనం అల్ ది బెస్ట్ చెబుదాం.