అక్కినేని అఖిల్ సినిమా ఆగిందా?

అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్ హిట్టు కోసం నానా ప్ర‌యాస ప‌డుతున్నాడు. తొలి సినిమా `అఖిల్‌` నుంచి `మిస్ట‌ర్ మ‌జ్ను` వ‌ర‌కు ఏ సినిమా క‌లిసి రాలేదు. అత‌న్ని ఆర్టిస్ట్‌గా ప్రేక్ష‌కులు పూర్తి స్థాయిలో అంగీరించిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. దీంతో త‌న‌ని తాను నిరూపించుకోవ‌డం కోసం అఖిల్ రంటికి క‌నిపించ‌ని యుద్ధ‌మే చేస్తున్నాడు. ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు.

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాసుతో క‌ల‌సి వాసువ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఫ‌స్ట్‌లుక్‌తో పాటు ఓ లిరిక‌ల్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. అంతా బాగానే వుంది. కానీ ఈ మూవీ షూటింగ్ అర్థాంత‌రంగా ఆగిపోయిన‌ట్టు తెలిసింది. గురువారం ఉద‌యం షూటింగ్ చేస్తుండ‌గా అఖిల్ కుడిచేతి ఎల్బొ ప్రాంతంలో గాయ‌మైన‌ట్టు తెలిసింది. వెంట‌నే డాక్ట‌ర్ని సంప్ర‌దించ‌డంతో వారం పాటు రెస్ట్ తీసుకోవాల్సిందే అని చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం అఖిల్ ఇంట్లోనే రిలాక్స్ అవుతున్నారు. అఖిల్ కండీష‌న్‌ని బ‌ట్టి ఈ నెల 10 నుంచి షూటింగ్ మొద‌లుపెట్టే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.