అందుకోసం ఆంజనేయ హోమం చేసిన పూరి , ఛార్మి

ఛార్మి, పూరి కలిసి స్పెషల్ హోమం

ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ లో పూర్తి మార్పులు వచ్చాయి. ఆయన తన అప్పులు అన్ని తీర్చుకున్నారు. అందుకు ఆంజనేయ స్వామి కారణం అని నమ్మి హోమం చేసారు. ఇప్పుడు ఆయన పూర్తిగా డిమాండ్ ఉన్న దర్శకుడు అయ్యారు. పూర్తిగా వెనకబడి పోయిన ఆయన మళ్లీ ఒక్కసారిగా డైరక్టర్స్ కు హాట్ ఫేవరెట్ అయ్యారు. ఆయన చేతిలో ఇప్పుడు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి.

ఈ నేపధ్యంలో ఆయన ఆంజనేయ స్వామికి కృతజ్ఞతలు తెలియచేసేందుకు కాను…ఓ స్పెషల్ హోమం నిర్వహించారు. తన ప్రొడక్షన్ పార్టనర్ ఛార్మితో కలిసి ఈ హోమం నిర్వహించారు. హైదరబాద్ కు అరవై కిలోమీటర్ల దూరంలో నరసాపూర్ లో ఉన్న చక్రిమెట్ల శంకర ఆంజయనేయ స్వామి దేవాలయంలో ఈ హోమం నిర్వహించారు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ తన తాజా చిత్రం ఫైటర్ బిజీలో ఉన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందనున్న ఈ చిత్రం త్వరలో పట్టాలు ఎక్కనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెలలో మొదలవుతుందని, 2020 సమ్మర్ లేదా అంతకంటే ముందే రిలీజ్ అయ్యలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.