యాదాద్రికి అరుదైన గౌరవం

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి దేవాలయానికి అరుదైన గౌరవం దక్కింది. యాదాద్రి నరసింహస్వామి ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ గుర్తింపు వచ్చింది. దేశంలోనే తొలిసారి ఓ ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ రావడం విశేషం. యాదాద్రికి అరుదైన గౌరవం దక్కడం పట్ల దేవాలయ అధికారులు సీఎం కేసీఆర్ ను కలిశారు. వారిని సీఎం అభినందించారు. దేశ చరిత్రలోనే ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ దక్కడంతో భక్తులు, తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.