Road Accident: యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎంను ఢీ కొన్న ద్విచక్ర వాహనం.. ప్రమాదంలో ముగ్గురు మృతి!

Road Accident: ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఇలా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరగడానికి గల కారణం వేగంగా నడపడమే కాకుండా, నిర్లక్ష్యం అని కూడా చెప్పవచ్చు.ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ఇలాంటి రోడ్డు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా యాదాద్రి పొగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది టోల్ ప్లాజా వద్ద ఆగివున్న డీసీఏంను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

చౌటుప్పల్ మండలం ఆరేగూడెం పంతంగి టోల్ ప్లాజా వద్ద డీసీఎంను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా అతనిని ఆసుపత్రికి తరలించారు. మృతులు చౌటుప్పల్ మండలం లక్కారం వాసులుగా గుర్తించారు. రోడ్డు ప్రమాదం జరగడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ క్రమంలోనే మృతులను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాద ఘటనను పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మృతుల బంధువులకు సమాచారం అందించిన పోలీసులు…..అసలు ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.