యాదాద్రి నరసింహ స్వామి భక్తులకు గుడ్‌న్యూస్!

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటామాని ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త. గతంలో నిర్ణయించిన ప్రకారమే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ నెల 28 నుంచి ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఇస్తారు.. ఈ నెల 21 నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం నిర్వహిస్తామని.. 108 పారాయణ దారులు, ఆలయ అర్చక బృందంతో ఈ క్రతువు ఉంటుందన్న ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ఈ మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారని వెల్లడించారు.