టిఆర్ ఎస్ రాములు నాయక్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఎమ్మెల్యే టికెట్ రాములు నాయక్ టికెట్ ఆశించగా అది రాకపోవడంతోనే పార్టీ మారాలని రాములు నాయక్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారేందుకు దారి తీసిన పరిస్థితులపై రాములు నాయక్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఇల్లందు టికెట్ ను రాములునాయక్ ఆశిస్తున్నె్ట్టు తెలుస్తోంది.
రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటి సమావేశం జరిగినప్పుడు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తన పార్టీ మారుడు అంశం తో పాటుగా ఎమ్మెల్యే టికెట్ పై చర్చించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన రావడంతో రాములు నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు.
కుంతియా, ఉత్తమ్ సమక్షంలో రాములు నాయక్ కాంగ్రెస్ లో చేరనున్నారు. లేనిచో 20 న జరిగే బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో రాములు నాయక్ కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతోనే రాములునాయక్ టిఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారని నేతల ద్వార తెలుస్తోంది.
