ఉత్తమ్ కు వైఫ్ స్ట్రోక్ తప్పదు : దూదిమెట్ల బాలరాజ్ యాదవ్

ఎన్నికల తర్వాత టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి ఊడటం ఖాయమని టిఆర్ఎస్ ఓయూ జేఏసీ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వైఫ్ స్ట్రోక్ తప్పదని కోదాడలో కాంగ్రెస్ ఓటమి తప్పదన్నారు. కోదాడలో విలేఖరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఏమన్నారంటే..

“తెలంగాణలో టిఆర్ఎస్ గెలుసు ఖాయం. మహా కూటమి పేరుతో కాంగ్రెస్ నేతలు నాటకాలాడుతున్నారు. అభివృద్ది పథంలో దూసుకుపోతున్న తెలంగాణలో కారు జోరును ఎవరూ ఆపలేరు. తెలంగాణలో తెలుగుదేశం అనే యాప్ డిలేట్ అయ్యింది. మళ్లీ మహాకూటమి అనే యాప్ లో టిడిపి యాప్ వచ్చింది. ఎన్నికల తర్వాత అన్ని యాప్ లు కొట్టుకుపోవడం ఖాయం.

మహా కూటమిలో దళిత, బిసి, గిరిజనులకు ఎన్ని సీట్లు కేటాయించారో చెప్పాలి. రెడ్డిలకు అధిక సీట్లు ఇచ్చి సామాజిక వర్గాలను అవమాన పరిచారు. కుటుంబ పాలన అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆయన భార్యకు సీటు ఎందుకు ఇచ్చారో చెప్పాలి. కోదాడల టిఆర్ఎస్ అభ్యర్ధి బొల్లం మల్లయ్య యాదవ్ గెలుపు ఖాయమైంది. పద్మావతి ఓటమి నిజమైతది. ఎన్నికలల్లో మహా కూటమి బోల్తా పడుతది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఉన్న పిసిసి పదవి కూడా పోతది. కారు స్పీడ్ కు బ్రేకులు వేయడం సాధ్యం కాదు. “ అని బాలరాజ్ యాదవ్ విమర్శించారు. బాలరాజ్ యాదవ్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

 

DUDIMETLA BALARAJ YADAV