కేసీఆర్ పై నారా లోకేష్ సెటైర్లు

 

టిఆర్ ఎస్ అధినేతపై ఏపీ మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. ఓ వైపు తెలుగు వారంతా కలిసి ఉండాలని చెబుతున్న కేసీఆర్ మరో వైపు ఆంధ్రావాళ్లు భాగో, తెలంగాణ ప్రజలు జాగో అంటూ కామెంట్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం టిఆర్ ఎస్ పార్టీలో టిడిపి నేతలు ఎంత మంది ఉన్నారో అందరికి తెలుసన్నారు. ఆంధ్రుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలను తన పక్కనే కూర్చోబెట్టుకున్నారని లోకేష్ సెటైరు వేశారు.

ఆంధ్రుల ఓట్లు లేకుండానే టిఆర్ ఎస్ జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు అందరికి తెలుసునని, కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు తమ అంతిమ తీర్పులో ఎవరికి మద్దతివ్వాలో వారికే ఇస్తారని లోకేష్ అన్నారు. లోకేష్ కేసీఆర్ పై సెటైర్లు వేయడంతో లోకేష్ దూకుడు పెంచాడని నేతలంతా చర్చించుకుంటున్నారు.