కాంగ్రెస్ పొన్నం పై టిఆర్ఎస్ గంగుల ఫైర్

కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. పొన్నం ప్రభాకర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గంగుల కమలాకర్ ఏమన్నారంటే…

“పొన్నం ప్రభాకర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు. ఆయన వ్యవహర శైలి కేఏ పాల్ ను గుర్తుకు తెస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. కేటిఆర్ ను విమర్శించే హక్కు పొన్నం ప్రభాకర్ కు లేదు. కరీంనగర్ లో ఐదు సార్లు పోటి చేస్తే ఒకసారి గెలిచిన చరిత్ర పొన్నం ప్రభాకర్ ది. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కూడా ఘోరంగా ఓడిపోయారు. వైఎస్ పుణ్యాన ఎంపీగా గెలిచారు.

హైదరాబాద్ లో పెద్ద లీడర్ ని అని బిల్డప్ ఇచ్చే పొన్నం కరీంనగర్ లో జీరో. కేటిఆర్ కాలిగోటికి కూడా పొన్నం సరిపోరు. గంగుల కమలాకర్ టిఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ పొన్నం అసత్య ప్రచారం చేశారు. నేను కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నించినట్టు నిరూపించాలలి లేకపోతే పొన్నం ముక్కు నేలకు రాయాలి.

2009లో తెలంగాణ చౌక్ లో ధర్నా చేస్తుంటే పొన్నం ఎ:పీగా ఉండి స్పందించలేదు. ధర్నా చేస్తున్న విద్యార్ధులను పోలీసులతో కొట్టించాడు. తన స్వార్ధ ప్రయోజనాల కోసమే లగడపాటితో పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చేయించాడు. పొన్నం మంచిగా మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అని గంగుల కమలాకర్ విమర్శించారు.