సీఎం కేసీఆర్ కు మమతా బెనర్జీ ఫోన్

సీఎం కేసీఆర్ కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ చేశారు. శనివారం కోల్ కత్తాలో శనివారం జరగనున్న యునైటెడ్ ఇండియా ర్యాలీకి రావాల్సిందిగా మమతా కేసీఆర్ ను ఆహ్వానించారు. అదే విధంగా ర్యాలీ పై చర్చించారు. అయితే ఈ ర్యాలీకి కాంగ్రెస్ తో పాటు, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, చంద్రబాబు ఈ ర్యాలీలో పాల్గొంటుండడంతో ఈ ర్యాలీకి దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.