హైదరాబాద్ లో దారుణం : చిన్న పోరన్ని కొట్టిన టీచర్

హైదరాబాద్ లోని ఓ పాఠశాలలో టిచర్ విద్యార్ధి పట్ల అమానుషంగా వ్యవహరించింది. బోర్డు వైపు చూడటం లేదన్న కారణంతో విద్యార్ధిపై విచక్షణ రహితంగా కొట్టింది.  ఈ ఘటన హైదరాబాద్ లోని జీడిమెట్లలో జరిగింది. వివరాలేంటంటే…

హైదరాబాద్ లోని చింతల్ కు చెందిన ప్రశాంత్ రెడ్డి కుమారుడు రత్నవర్ధన్ రెడ్డి అనే 6 సంవత్సరాల బాలుడు ఎన్ ఆర్ ఐ టాలెంట్ స్కూల్ లో యూకేజి చదువుతున్నాడు. రత్న వర్ధన్ రెడ్డి బోర్డు వైపు చూడకుండా దిక్కులు చూస్తున్నాడనే కారణంతో టిచర్ సునీత రత్నవర్ధన్ చేతులపై కొట్టింది.

విద్యార్ధి శరీరంపై ఉన్న గాయాలు

సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చిన తల్లి చూసేసరికి విద్యార్ధి చేతులపై వాతలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న తల్లి టీచర్ సునీతను నిలదీయగా బోర్డు చూడటం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. బాలుడి తండ్రి ప్రశాంత్ రెడ్డి బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. టిచర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని బాలల  హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతారావు డిమాండ్ చేశారు.