గజ్వేల్ నియోజకవర్గంలో 18 ఏండ్లు నిండితే సొంతిల్లు : కేసిఆర్

సిద్దిపేట జిల్లా, గజ్వెల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ,మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి దాదాపు 20 వేల మంది నాయకులు, కార్యకర్తలు హాజరు.

సమావేశంలో సీఎం కేసీఆర్ కామెంట్స్..

* ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ప్రజల్లోనే ఉంటూ గడుపుతారు
* సిద్దిపేట ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ప్రజాల్లోనే ఉంటూ నేనూ పని చేసేవాడిని.
* ఇప్పుడు పాత్ర మారింది… రాష్ట్రంలోని 31 జిల్లాలను చూసుకునే పరిస్థితి వచ్చింది.
* గజ్వెల్ గతంలో ఉన్న దాని కంటే కాస్త మెరుగైంది… ఇక్కడితో ఆగి పోవద్దు.
* భూగోళంపై మానవజాతి ఉన్నత కాలం సమస్యలు ఉంటాయి.. అమెరికా లోనూ సమస్యలు ఉంటాయి.
* గజ్వెల్ నియోజకవర్గంలో 18 ఏండ్లు నిండిన ఏ వ్యక్తి ఇల్లు లేకుండా ఉండకూడదు.
* డివిజన్ కేంద్రం, ఆర్డీఓ, డిఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాం.
* అన్ని రహదారులు తారు రోడ్లు, డబుల్ రోడ్లు కావాలి.
* గజ్వెల్ కు రైలు రావాలి. అది కరీంనగర్ కు వెళ్ళి అక్కడి నుంచి రైట్ కు పోతే ఢిల్లీకి, లెఫ్ట్ పోతే ముంబయికి పోతది. ఈ లైన్ ఈ ప్రాంతానికి ముఖ్యంగా మారుతుంది.
* ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగు నీరు రావాలి.
* వచ్చే వర్షా కాలం నాటికి అన్ని చెరువులు, కుంటలు నింపుకుంటాం.
* గజ్వెల్ సాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన రిజర్వాయర్ కొండపోచమ్మ సాగర్.
* గజ్వెల్ నియోజక వర్గానికి లక్ష 80 వేల ఎకరాలకు సాగు నీరు అందబోతోంది .
* పండిన పంట మేలైన ధరకు, అన్ డిమాండ్ అమ్ముడు పోవాలి.
* కల్తీ వస్తువులతో అనేక రోగాలు వస్తున్నయి.
* ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాల్సి ఉంది.. గజ్వెల్ లో ఫస్ట్ ఫేసులోనే వస్తాయి.
* పంట కాలనీలు మొదట గజ్వెల్ లోనే ఏర్పాటై తెలంగాణకు ఆదర్శం కావాలి.
* వచ్చే రెండేళ్లలో ఇల్లు లేని కుటుంబం గజ్వెల్ లో ఉండ కూడదు.
* మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా వస్తే పాడి, పంట బాగుపడుతది.
* ప్రతి ఇంటికి 70 శాతం సబ్సిడిపై అందిస్తాం.
* నేను ప్రజల్లోకి వెళ్లి డబ్బా కొట్టుకోలే..
* ప్రజల బాగు కోసం పథకాల రూపకల్పన జరగాలి… ఈ ఎర్రవల్లిలోనే 70 శాతం పథకాలను ఆలోచించి అమలు చేసాం.
* కంటి వెలుగు పథకాన్ని అమెరికాలో చూసి అమలు చెయలేదు.. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆలోచించే అమలు చేశాను.
* ఇంత పకడ్బందీగా కంటి వెలుగు అమలు అవుతుందంటే రెండు నెలలు కష్టపడ్డా.
* పాత ప్రభుత్వ సంప్రదాయాలు, ఇనుపగోడలు బద్దలు కొట్టి అమలు చేస్తున్న పథకమే రైతు బంధు.
* గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వారికి వ్యవసాయం తెలియదా ? వారెందుకు ఆలోచించ లేదు.
* గజ్వెల్ నియోజకవర్గంలో గ్రామా ప్రణాళికలు వేసి, మళ్ళీ నాలుగేళ్ల నాటికి రూపురేఖలు మార్చాలి.
* పేదరికానికి కులం లేదు… అది అందరిని దహించి వేస్తోంది.
* అన్ని కులాల్లో పేదరికం ఉన్నది.. దళిత వర్గాల్లో, బీసీ వర్గాల్లో ఎక్కువగా, మిగితా కులాల్లో కాస్త తక్ఖవగా ఉంది.
* వెయ్యి ఏండ్లు ఎవరూ బతకరు .ఉన్నసమయం లోనే ఉన్నత లక్ష్యాల కోసం పని చేయాలి.
* రాష్ట్రం కోసం పని చేయడంలో ఎక్కువ సమయం కేటాయించిన… వచ్చే టర్మ్ లో గజ్వెల్ కు కూడా కొంత సమయం కేటాయిస్తానని ప్రామిస్ చేస్తున్న.
* దేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రం.. 17.17 వృద్ధి రేటుతో ముందుకు పోతున్నము. దేశంలో చాలా రాష్ట్రాలు ఇందులో సగం కూడా లేదు.
* ఇది వట్టిగా రాలేదు.. కడుపు కట్టుకోవాలి.. అవినీతిని రూపుమాపాలి అహర్నిశలు శ్రమించాలి.
* విమర్శించే వాళ్ళను ప్రశ్నించండి.
* మంచినీటి పథకం అంటే గతంలో ఆడో బోరు.. ఇడొ బోరు అంటే.. ఇప్పుడు మిషన్ భగీరథ తో ఇంటింటికీ నల్లా నీరు వస్తుంది.. ఈ నీళ్లు 200 కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి నీళ్ళు ఇస్తున్నాం.
* రాష్ట్రంలో 20 వేల గ్రామాల్లో పూర్తయింది.. మరోబ్15 రోజుల్లో 3 వేల గ్రామాల్లో పూర్తి కానుంది.
* మన నెక్స్ట్ టార్గెట్ పేదరిక నిర్మూలన.
* అన్ని వర్గాల్లోనూ పేదరికాన్ని పారద్రోలాలి.
* రేపు గజ్వెల్ను చూడటానికి దేశం నుంచి ఎందరో వస్తారు
* గజ్వెల్ నియోజకవర్గం స్వావలంబన సాధించిన నియోజకవర్గంగా మారాలి.
* అలా మారాలంటే కమిటిమెంట్, కన్విక్షన్ ఉండాలి.
* ఎన్నికల తరువాత
* ఇంకో 70 వేల కోట్లను ఖర్చు చేస్తే కోటి ఎకరాల తెలంగాణ అయితది.
* ఇది పూర్తయితే 10 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది.
* రాష్ట్ర వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి సిస్టమ్ అమలు చేస్తాం.. ఆ పైలెట్ ప్రాజెక్టును గజ్వెల్ నుంచే మొదలు పెడతాం.
* మహిళల కోసం కూడా నా మనసులో మంచి ఆలోచన ఉన్నది.
* లిజ్జత్ పాపాడ్ ముంబాయి లోని ఓ మురికి కాలనిలో ఓ మహిళ సంఘం ప్రారంభించింది.. ఇప్పుడు దాని టర్నోవర్ వెయ్యి కోట్లు..
* ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో మహిళలకే ప్రాధాన్యత ఉంటుంది.
* ఎన్నికల నిబంధనలు మనమంతా పాటించాలి.
* అన్ని నియోజకవర్గాల్లో ఒక అబ్జర్వర్ ఉంటే సీఎం నియోజకవర్గానికి ఇద్దరు ఉంటారు.
* 14న నామినేషన్ వేస్తున్నా.. ఎవరూ రావద్దు.. 10 మందితో కలిసి వెళ్లి వేస్తాను.
* చివర్లో భారీ ఎత్తున పబ్లిక్ మీటింగ్ పెట్టుకుందాం.
* గజ్వెల్ గెలుపు నకు ఢోకా లేదు
* ఈ సారి కేంద్ర రాజకీయాల్లో కూడా కీలకపాత్ర పోషించబోతున్నాం.
* దుర్మార్గుల విమర్శలకు సమాధానంగా ఎన్నికలకు పోతే ఈ రోజు గోళ్లు గిల్లుకుంటూ విపక్షాలు కూచున్నాయి.
* ఈ నెల 15 నుంచి నుంచి నా టూర్ లు ఉంటాయి.
* గజ్వెల్ కథానాయకులు మీరే

★ మంత్రి హరీశ్ రావు కామెంట్స్..

* ఇక్కడికి 20 వేల మంది కార్యకర్తలు వచ్చారు. ఒక్కక్కరూ 10 మంది చేత ఓటేపిస్తే 2 లక్షలు దాటుతుంది.
* అభివృద్ధిలో గజ్వెల్ 20 ఏండ్లు ముందుకు పోయిందని అంటున్నారు.. కాని కేసీఆర్ చారాణే మాత్రమేనంటున్నారు. ఇపుడే 20 ఏండ్లు ముందుంటే, మిగితా భారణ పూర్తి చేస్తే 70 ఏండ్ల ముందుకు పోతుంది. దేశానికే ఆదర్శంగా గజ్వెల్ నిలుస్తుంది.
* గులాబీ సైనికులు ఈసి నిబంధనలు తూ. చ. తప్పకుండా పాటీంచాలి.
* ఏ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామంలోనే ఉండి ప్రచారం చేయాలి.
* ఏది చేసినా ఈసి అనుమతి తీసుకోవాలి.
* 95 శాతం ప్రజలు టిఆర్ఎస్ వైపే ఉన్నారు.

★ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్..

* అభివృద్ధిని అడ్డుకుంటున్న గుంట నక్కల నుంచి గజ్వెల్ ను కాపాడుకోవాలి.
* ముఖ్యమంత్రి పై పోటీ చేశామన్న సంతృప్తి తప్ప ప్రత్యర్గులకు మిగిలేదేమి లేదు.
* కూటమి అభ్యర్థి ప్రతాప్ రెడ్డికి డిపాజిట్ దక్కే పరిస్థితి లేదు.
* బంగారు తెలంగాణ కు గజ్వెల్ నుంచే బాటలు పడుతున్నాయి.