వైరల్ అవుతోన్న ఎంపీ కవిత పెట్టిన ఫోటో

ఎంపీ కవిత పెట్టిన ఫోటో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందరూ ఈ ఫోటోని తెగ షేర్ చేసుకుంటున్నారు. కల్వకుంట్ల కవిత తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటో పెట్టారు. ఈ ఫోటోకి మదర్స్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆవిడ ఈ ఫోటో పెట్టగానే రీట్వీట్స్, కామెంట్స్, లైక్స్ స్టార్ట్ అయిపోయాయి.

కవిత తన ట్విట్టర్ ఖాతాలో ఒక తల్లి బండిపై కొడుకుతో వెళ్తున్న ఫోటో పెట్టారు. ఇందులో అంతగా ఆకట్టుకునే విశేషం ఏముంది అనుకుంటున్నారా? విశేషం ఉంది. ఆ తల్లి తాను హెల్మెట్ ధరించకుండా కొడుకుకి పెట్టింది. ఆదివారం హైదరాబాద్ లో ఆకస్మిక వర్షం కారణంగా జారిపోతున్న రోడ్లపై వాహనం నడుపుతున్న తల్లి తన బిడ్డకి హెల్మెట్ పెట్టింది. అని ఆ ఫొటోలో రాసి ఉంది. 

తన సేఫ్టీ కంటే కొడుకు సేఫ్టీ ముఖ్యం అనుకుని కొడుకుకి హెల్మెట్ పెట్టింది ఆ మహిళ. తల్లి ప్రేమను చాటుతున్న ఈ ఫోటో కవితను ఆకట్టుకుంది. ఎంతైనా కవిత కూడా ఒక తల్లికి బిడ్డ, ఇద్దరు కొడుకులకు తల్లి కదా. పైగా ఆవిడ హెల్మెట్ గురించి ప్రచారం కూడా చేస్తుంటారు కదా… చూడగానే కనెక్ట్ అయుంటారు, ఫోటో పోస్ట్ చేశారు. కింద ఆ ఫోటో ఉంది చూడండి.

Mothers ?? pic.twitter.com/LpsSVB8kn9

— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 28, 2018