Danam Nagender: బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత తన ఇంటి తగాదాల వల్లే కొత్త పార్టీ పెట్టారని, అది పూర్తిగా వారి కుటుంబ అంతర్గత వ్యవహారమని విమర్శించారు. మంగళవారం ఆదర్శ్నగర్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో సాగుతోంది రాక్షస పాలన కాదు.. ఆదర్శ పాలన అని అన్నారు!
తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందంటూ కవిత చేసిన వ్యాఖ్యలను దానం నాగేందర్ తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. “సొంత తండ్రిని రోబోగా అభివర్ణించిన కవిత.. ఇప్పుడు కొత్త పార్టీ పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు” అని ఎద్దేవా చేశారు.

ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దానం తెలిపారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ (CMRF) ఎల్వోసీలను కూడా అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ సేవా కార్యక్రమంలో తహసీల్దార్లతో పాటు మాజీ కార్పొరేటర్లు మామిడి నర్సింగ్రావు, వనం సంగీత యాదవ్, ఇతర ముఖ్య నాయకులు రామన్గౌడ్, వైల ప్రవీణ్ కుమార్, రమణగౌడ్, శ్రీనివాస్గౌడ్, ఆంథోని, రవి, సర్పరాజ్ తదితరులు పాల్గొన్నారు.

