టిఆర్ఎస్ ప్రచారంలో హారీష్ రావుకు తప్పిన ప్రమాదం

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హారీష్ రావుకు పెను ప్రమాదం తప్పింది. తూప్రాన్ లో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న హారీష్ రావు వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హారీష్ రావు ప్రసంగిస్తుండగా వాహనంలోని జనరేటర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

దీంతో హారీష్ రావు, ఎంపీ అభ్యర్ది కొత్త ప్రభాకర్ రెడ్డి వాహనం దిగి దూరం వెళ్లారు. వీరితో పాటు ఉన్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్‌లు కూడా వాహనం దిగి దూరం వెళ్లారు. క్షణాల్లో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జనరేటర్ లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు.