హైదరాబాద్ లో దారుణం జరిగింది. మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాసుగూడలోని రాజీవ్ గృహ కల్పలో నివాసం ఉండే 14 ఏళ్ల అమ్మాయి వైష్ణవిని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. రాజీవ్ గృహకల్పనలో నివాసం ఉండే ప్రభు,అనసూయ దంపతుల కుమార్తె వైష్ణవి. ఆదివారం ఉదయం వాకింగ్ కు వెళుతున్నానంటూ బయటికి వెళ్లిన వైష్ణవి బయటికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. చుట్టు పక్కల వెతికినా తల్లిదండ్రులకు వైష్ణవి కనిపించకపోవడంతో సాయంత్రం ఆరు గంటలకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సోమవారం ఉదయం బాలిక రాజీవ్ గృహ సమీపంలోనే శవమై కనిపించింది. ఇది తెలిసిన వారి పనిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. వైష్ణవి 8వ తరగతి చదువుతోంది. తమకు ఎవరితోనూ విభేదాలు లేవని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. వైష్ణవిని ఆమె మేనమామ పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి చేస్తున్నట్టు స్థానికుల ద్వారా తెలుస్తోంది. మేనమామే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బిడ్డ అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వైష్ణవి హత్యకు గురైన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.
