తెలంగాణ కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ… బిజెపిలో చేరిన డికె అరుణ

తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ మీద షాక్ తగులుతోంది. తెలంగాణ సీనియర్ నేత డికె అరుణ బిజెపి కండువా కప్పుకున్నారు. మంగళవారం ఉదయం బిజెపి నేత రాంమాధవ్ అరుణ ఇంటికెళ్లి చర్చలు జరిపారు. ఆ తర్వాత వెంటనే ఆయనతో కలిసి డికె అరుణ ఢిల్లికి వెళ్లారు. అక్కడ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు జరిపారు.

మంగళవారం అర్ధరాత్రి సమయాన డికె అరుణకు కండువా కప్పి అమిత్ షా పార్టీలోకి ఆహ్వానించారు. మహబూబ్ నగర్ ఎంపీ సీటును ఆమెకు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అదే విధంగా డికె అరుణ రాజకీయ భవిష్యత్తు పై అమిత్ షా పూర్తి భరోసానిచ్చారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో కలవరం మొదలైంది.