చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అరెస్టు

కాంగ్రెస్ నేత, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిదంటూ ఆయన మంగళవారం వికారాబాద్ లో దీక్షకు దిగారు. ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు.

“తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి రంగారెడ్డికి అన్యాయం జరిగింది. గత ఐదేళ్లలో జిల్లాకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదు. ఎంపీగా ఉన్నా కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాను. మంత్రి, ఎమ్మెల్యేలదే రాజ్యం అయ్యింది. ప్రైవేటు, పబ్లిక్ సెక్టర్లాలలో ప్రభుత్వం ఉద్యోగాలివ్వలేదు. ఆర్థిక వనరుల పరంగా రంగారెడ్డిని దోచుకుంటున్నారు కానీ అభివృద్దికి మాత్రం రూపాయి విడవడం లేదు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తాను ఆందోళనకు దిగాను” అని అన్నారు.