ఏపీలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు… పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం..!

ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులకు వైద్య ఆరోగ్యశాఖ శుభవార్త తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా ఆసుపత్రిలో ఉన్న వివిధ రకాల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో ఉన్న స్టాఫ్ నర్స్, సెక్యూరిటీ గార్డ్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పోస్టులు భర్తీ చేయటానికి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.

ఈ పోస్టులు భర్తీ చేయటానికి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించటం లేదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థుల అర్హత, అనుభవం ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అందువల్ల ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు పోస్టు ద్వారా ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్టాఫ్‌ నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, పీడియాట్రీషియన్‌, సెక్యూరిటీ గార్డ్స్‌, మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించిన ఖాళీలు, దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండవలసిన అర్హత తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అర్హతలు, ఇతర వివరాలు.. పోస్టులను బట్టి ఐదో తరగతి నుండి 10వ తరగతి, ఇంటర్/ జీఎన్‌ఎం/ డిగ్రీ/ బీఎస్సీ/ ఎంబీబీఎస్‌/ డిప్లొమా/ పీజీ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులతో పాటు ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ లో ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ. 300 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి నెలకు రూ.12 వేల నుంచి రూ.1,10,000 వేలు వరకు జీతంగా అందుకుంటారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా.. జిల్లా వైద్యాధికారి కార్యాలయం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.