అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చిన పేటీఎం… ఇక బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ఆర్థిక లావాదేవీలు అన్ని కూడా యూపీఐ ద్వారా జరుగుతున్నాయి.ఈ యూపీఐ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పేటీయం ద్వారా చిన్న మొత్తాల్లో చెల్లింపులు చేసేందుకు గానూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో యూపీఐ లైట్ సేవలను ప్రారంభించింది. ఇక ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి న తొలి బ్యాంక్ పేటీఎం .

పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కొత్తగా తీసుకొచ్చిన ఈ యూపీఐ లైట్ వాలెట్‌ ద్వారా చిన్న మొత్తాలను సులభంగా చెల్లింపులు చేయొచ్చు. ఎలాగంటే..ఒక సారి గరిష్టంగా రూ.200 వరకు ఇన్‌స్టాంట్‌గా పంపిచొచ్చు. కనిష్ఠంగా రూ.2,000 వరకు యాడ్ చేసుకోవచ్చు. అయితే ఒక రోజులో రెండు సార్లు మాత్రమే యాడ్ చేసుకునే వీలుంటుంది. అంటే రోజులో గరిష్ఠంగా రూ.4000 వరకు పేమెంట్స్ చేయవచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు నుంచి యూపీఐ లైట్‌ను లాంచ్ చేసినందుకు వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూపీఐ లైట్ ద్వారా వినియోగదారులు వేగంగా, సురక్షితంగా,

దీని ద్వారా చిన్న మొత్తాల ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. అలాగే రూ.200 లోపు ఉండే లావాదేవీలను వారి కోర్ బ్యాంక్‌తో సంబంధం లేకుండా 50 శాతం వరకు ట్రాన్సా క్షన్లు పూర్తి చేయవచ్చు. ఇలా చేయటం వల్ల లావాదేవీల సక్సెస్ రేటును పెరుగుతుంది.ఈ యూపీఐ ప్లాట్ ఫామ్ ద్వారా రోజుకు బిలియన్ ట్రాన్సా క్షన్ల ప్రక్రియను మరింత పెంచుతుందని ఎన్‌పీసీఐ సీఓఓ ప్రవీణ్‌ రాయ్‌ అన్నారు. అంతే కాకుండా యూపీఐ లైట్ లావాదేవీలు కేవలం పేమెంట్ బ్యాలెన్స్ హిస్టరీ సెక్షన్‌లో మాత్రం కనిపిస్తాయి, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్‌లో కనిపించవని ఆయన వెల్లడించారు. పేటియం అందిస్తున్న ఈ యూపీఐ లైట్ సేవలు వల్ల వినియోగదారులకు ఎంతో ఉపయోగం ఉంటుంది.