నెలకు రూ.7500 పెట్టుబడితో సులువుగా రూ.కోటి సంపాదించే అవకాశం.. ఎలా అంటే?

తక్కువ మొత్తం పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పెట్టుబడి పెట్టడానికి ఉన్న ఉత్తమమైన స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి. నెలకు కేవలం 7500 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు గ్యారంటీ రిటర్న్స్ లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కనీసం 500 రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు నెలకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు వడ్డీ 7.1 శాతం కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లభిస్తుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ 15 సంవత్సరాలు కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ లభిస్తాయి.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై వచ్చే వడ్డీతో పాటు మెచ్యూరిటీ అమౌంట్ పై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. నెలకు 7500 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే 25 సంవత్సరాల తర్వాత కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం లభిస్తుంది. చిన్న వయస్సులోనే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే ఎక్కువ మొత్తం లభిస్తుంది. పెట్టుబడిని ఎక్కువ సంవత్సరాలు పొడిగిస్తే ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది.

ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ లేదా బ్యాంక్ బ్రాంచ్ ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుని పెట్టుబడులు పెడితే మంచిది.