ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్..సరికొత్త మార్పులతో ఐఫోన్ 15..?

ఆపిల్ ఐఫోన్ మొబైల్ రంగంలో నంబర్ వన్ గా కొనసాగుతోంది. అందువల్ల ఐఫోన్ ఉపయోగించాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మోడల్స్ ని మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటారు. ఇటీవల ఐఫోన్ 15 సరికొత్త టెక్నాలజీ తో మార్కెట్లోకి వచ్చింది. యాపిల్ మొబైల్ లో ఎన్నో సౌకర్యాలతో పాటు సెక్యూరిటీ ఉండడం వల్ల ఎక్కువమంది ఐఫోన్ ఉపయోగించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇటీవల ఐఫోన్ యూజర్లకు ఆ సంస్థ ఒక శుభవార్త తెలియజేసింది. యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 15 ని మూడు భారీ మార్పులతో వచ్చే ఏడాది కస్టమర్ల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.

సెక్యూరిటీ కారణాలతో పలు రకాలుగా ఈ మొబైల్ పైన విమర్శలు వస్తున్నాయి. ఇకపై ఐఫోన్ సిరీస్ యుఎస్బి టైప్ సి సపోర్టుతో రాబోతోంది. ఇప్పటివరకు ఐఫోన్ లైటింగ్ పోర్టును ఆఫర్ చేస్తుండగా ఐఫోన్ 15 సిరీస్ యూఎస్బీ టైప్ సి పోర్టును ఆఫర్ చేయడంలో భారీ మార్పుని చెప్పవచ్చు. 2023 నాటికి అన్ని ఐఫోన్ మొబైలు యధావిధిగా యూఎస్బీ టైప్ సి పోర్టుని కలిగి ఉంటాయని ఆ సంస్థ యాజమాన్యం వెల్లడించింది. ఐఓఎస్ యూజర్లను థర్డ్ పార్టీ ఆఫ్ స్టోర్ ల నుంచి కూడా ఇందులో డౌన్లోడ్ చేసుకొని సదుపాయాన్ని యాపిల్ సంస్థ యుజరల్లకు కల్పిస్తోంది.

అంతే కాకుండా ఆండ్రాయిడ్ యూసర్లు ఎప్పటినుంచో ఆస్వాదిస్తున్న వెలుసుబాటు ఇకపై యాపిల్ యూజర్లకు కూడా అందుబాటులో రాబోతున్నట్లు తెలుస్తొంది. ఇక మరొక ముఖ్యమైన చఅప్డేట్ ఏమిటంటే ఇందులో కీలకమైన మార్పు విషయానికి వస్తే ఐఫోన్ 15 ప్రో వేరియంట్లు 14 ప్రో మోడల్స్ లో కనిపించిన న్యూ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ తో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. స్టాండర్డ్ ఐఫోన్ 15 మొబైల్ కూడా ఈ ఫ్యూచర్ తో అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ఆ సంస్థ వెల్లడించింది. రాబోతున్న జనరేషన్ దృష్టిలో పెట్టుకొని ఐఫోన్ మొబైల్ లో పలు రకాలుగా చేంజ్ చేసి వచ్చే యేడాది విడుదల చేయబోతున్నట్లు తెలియజేశాయి ఐఫోన్ సంస్థ.