యూపీఐ లావాదేవీలు చేసేవాళ్లకు శుభవార్త.. మరింత వేగంగా చేసే అవకాశం?

గత కొన్నేళ్లలో యూపీఐ పేమెంట్ల తీరు మారిపోయింది. ఎవరికైనా యూపీఐ పేమెంట్ చేయాలంటే సులువుగా చేస్తున్నాం. ప్రస్తుతం పల్లెటూర్లలో సైతం యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే మనం యూపీఐ ద్వారా ఎవరికైనా డబ్బులు పంపితే ఆ లావాదేవీ పూర్తి కావడానికి ప్రస్తుతం 30 సెకన్ల సమయం పడుతోంది.

కొన్ని సందర్భాల్లో ఈ సమయం 30 సెకన్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. అయితే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ క్రెడిట్, డెబిట్ కు సంబంధించిన లావాదేవీలు కేవలం 15 సెకన్లలో పూర్తయ్యే విధంగా ఆదేశాలు జారీ చేసింది. జూన్ నెల 16వ తేదీ నుంచి యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా జరగనున్నాయి.

అదే సమయంలో యూపీఐ లావాదేవీలు చేసేవాళ్లకు ప్రయోజనం చేకూరేలా ట్రాన్సాక్షన్ స్టేటస్, ట్రాన్సాక్షన్ రివర్సల్, అడ్రస్ వ్యాలిడేషన్స్ సమయం కూడా 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు తగ్గనుందని తెలుస్తోంది. యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా జరిగితే తరచూ లావాదేవీలు చేసేవాళ్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యూపీఐతో పాటు మరికొన్ని యూపీఐ యాప్స్ సైతం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. యూపీఐ లావాదేవీలు ఎక్కువగా చేసేవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. యూపీఐ లావాదేవీలను మనం చేస్తున్న ఎన్నో పనులను సులభతరం చేశాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.