ఉప్పల్ వన్డేలో టిమిండియా టార్గెట్ 237 పరుగులు

భారత్ ఆసీస్ ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 236 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ బ్యాట్ మెన్స్ ఫించ్ 0, ఖవాజా 50, హ్యండ్స్ కోంట్ 19, మ్యాక్స్ వెల్ 40, టర్నర్ 21, నైల్ 28, క్యారీ 36, కమిన్స్ 0 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ లు తలా రెండు వికెట్లు తీశారు. జాదవ్ ఒక వికెట్ తీశారు. దీంతో భారత్ 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది.